29 July, 2026 | 10:05 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా   •   గురుపౌర్ణిమ వేడుకల్లో సాయిబాబా ఆశీస్సులు పొందిన మున్సిపల్ చైర్మన్   •   నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి   •   గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •  

రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి

29-07-2026 09:01 PM

హుస్నాబాద్: హుస్నాబాద్ - హన్మకొండ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాధుల యాదలక్ష్మి (60) పని నిమిత్తం మల్లారం వెళ్లి తిరిగి వస్తూ పెట్రోల్ బంక్ సమీపంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందారు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది.