రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి
29-07-2026 09:01 PM
హుస్నాబాద్: హుస్నాబాద్ - హన్మకొండ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాధుల యాదలక్ష్మి (60) పని నిమిత్తం మల్లారం వెళ్లి తిరిగి వస్తూ పెట్రోల్ బంక్ సమీపంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందారు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది.






