చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం
చిట్యాల,(విజయక్రాంతి): సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్ విజయ్ కుమార్ అధ్యక్షతన సర్ -2026 కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని అన్ని రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, ప్రతినిధులతో తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ -2026 ప్రక్రియలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా వివరించారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఓటర్ల జాబితాల క్రోడీకరణ, ఓటర్ల బదిలీలు, పేర్ల చేర్పు, తొలగింపు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి, వారి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు. ఓటరు జాబితాలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సర్ -2026 ప్రక్రియ విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్ కార్యాలయ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.






