వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు
29-07-2026 08:50 PM
సదాశివ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మరికల్ గ్రామ శివారులోని గురుకుల డిగ్రీ కళాశాల బుధవారం రచయిత సింగిరెడ్డి నారాయణ రెడ్డి, వేద వ్యాసుడు ల జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వ్యాస పౌర్ణమి గురించి విద్యార్థినిలకు వివరించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి,సినారే, వెధవ్యాసుడు ల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, అధ్యాపక, అధ్యాపకేతర బృందం , విద్యార్థులు పాల్గొన్నారు.






