నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు
29-07-2026 09:04 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో బాబా ను దర్శించుకొని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సక్రమంగా కురవాలని పాడిపంటలు పండాలని ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని బాబాను వేడుకున్నట్లు ఎమ్మెల్యే పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి వ్యాపారవేత్త నాగులగామ వెంకన్న,నసురుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






