27 June, 2026 | 7:08 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

07-05-2026 11:47 AM

బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నందుకే గుండు అయింది

బండి సంజయ్ పంచినది అవినీతి డబ్బా.. రేవంత్ పంపిన డబ్బా?

బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్( Bandi Sanjay)పై హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ లో మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.... కేటీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. ''మీకు దమ్ముంటే రండి.. ఏ అంశంపై అయినా చర్చకు మేం రెడీ'' అన్నారు.

తంబాకులో డ్రగ్స్ కలిపి తినడం వల్లే బండి సంజయ్ కి బట్టతల వచ్చిందని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే మేమూ మాట్లాడతామన్నారు. ''నువ్వుమగాడివైతే అని మేమూ అనగలం'' అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానని బండి సంజయ్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కోట్లు ఎలా ఖర్చుపెట్టారు?, బండి సంజయ్ పంచినది అవినీతి డబ్బా.. రేవంత్ పంపిన డబ్బా? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.