ధర్మన్తో స్క్రీన్ పంచుకోనుందా!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 173వ సినిమాకు ‘ధర్మన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ను ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రజినీకాంత్ ‘ది డెడ్లీ డాక్టర్’ అవతారంలో కనిపించనున్నారు. కమల్హాసన్ తన రాజ్కమల్ ఫిలమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
త్వరలో సెట్స్పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, యంగ్ బ్యూటీ రాశి ఖన్నా భాగమైనట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో అప్డేట్ కోలీవుడ్ వర్గాల్లో వినవస్తోంది. తాజాగా మీనాక్షి చౌదరి కూడా ఈ ప్రాజెక్టులో భాగమైందట. ప్రస్తుతం డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తమిళ స్టార్ శింబుతో ‘ఎస్టీఆర్51’ కోసం పనిచేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఎంపిక చేయగా, ఇప్పుడు ‘తలైవా 173’ కోసమూ ఈ బ్యూటీనే లాక్ చేశారని టాక్. అధికారిక ప్రకటనైతే రాలేదు కానీ, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.






