ఇరాన్పై భీకర దాడులు.. 787 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో మధ్యప్రాచ్యం రణరంగమైంది. యుద్ధం క్రమంగా గల్ఫ్ దేశాలకు పాకడంతో ఆయా దేశాలు అట్టుడికిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 787 మంది మరణించారని ఇరాన్లోని రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఇంతలో అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఇన్ ఇరాన్ (Human Rights Activists in Iran) 176 మంది పిల్లలు సహా 742 మంది పౌరులు మరణించారని నివేదించింది.
ఇరాన్ పార్లమెంట్ హెల్త్ కమిషన్(Iranian Parliament Health Commission) సభ్యురాలు ఫతేమెహ్ మొహమ్మద్బీగి మాట్లాడుతూ.. ఇరాన్లోని తొమ్మిది ఆసుపత్రులను ఇజ్రాయెల్-అమెరికా తమను లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు. టెహ్రాన్లోని గాంధీ ఆసుపత్రి(Tehran Gandhi Hospital)ని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలపై ఐడిఎఫ్ స్పందిస్తూ దాడి ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది. ఇజ్రాయెల్-అమెరికా రెండూ ఒకే ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించారు.




