14-02-2026 12:41:37 AM
డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్
బూర్గంపాడు,ఫిబ్రవరి13,(విజయక్రాంతి):విద్యార్థులు, గర్భిణీలు పోషక ఆ హారం లోపం బారిన పడకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలని డిఎంహెచ్ఓ తుకా రం రాథోడ్ సూచించారు. శుక్రవారం మం డలంలోని మోరంపల్లి బంజర జడ్పీ హై స్కూల్లో ఐటీసీ సారపాక ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తహీనత (అనీమియా) అవగా హన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సం దర్భంగా విద్యార్థులు,గర్భిణీ స్త్రీలకు స్వ యంగా అనీమియా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.అనీమియా లక్షణాలు, కారణా లు, నివారణ చర్యల గురించి వివరించారు.
మంచి ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం, రోగనిరోధక శక్తి పెంపు ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వినియో గం అవసరమని తెలిపారు.అనంతరం కుష్టు వ్యాధిపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యురాలు డా.సాహితి,స్థానిక సర్పంచ్ బొర్రా సుభద్ర, ఉప సర్పంచ్ పొక్కుల రవి,డీపీఎంఓ మోహ న్, ఎంపి హెచ్ఈఓ రవి, గీతా పల్లవి,రాజేష్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు,వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.