ములుగు జిల్లాలో ఈదురుగాలులు
31-03-2026 12:00 AM
నేలకొరిగిన వృక్షాలు
మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో సోమవారం ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. పెనుగాలులకు పెద్దపెద్ద వృక్షాలు నేలకూలాయి. ములుగు జిల్లా తాడ్వాయి ఏటురు నాగారం మార్గమధ్యంలో పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు తోడు చిరుజల్లు కురిసింది. రోడ్ల పై పడిపోయిన చెట్లను తాడువాయి పోలీసులు పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.




