27 May, 2026 | 11:40 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

ములుగు జిల్లాలో ఈదురుగాలులు

31-03-2026 12:00 AM

నేలకొరిగిన వృక్షాలు 

మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో సోమవారం ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. పెనుగాలులకు పెద్దపెద్ద వృక్షాలు నేలకూలాయి. ములుగు జిల్లా తాడ్వాయి ఏటురు నాగారం మార్గమధ్యంలో పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు తోడు చిరుజల్లు కురిసింది. రోడ్ల పై పడిపోయిన చెట్లను తాడువాయి పోలీసులు పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.