ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి
27-05-2026 04:31 PM
బోథ్,(విజయక్రాంతి): రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి చేరే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాదవ్ నరేష్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి కోరారు. బుధవారం బోత్ మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించడం జరిగింది. ప్రభుత్వం మీపై నమ్మకంతో బాధ్యతలు కట్టబెట్టిందని అయితే రైతుల సమస్యల పైన ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావడంతో పాటు పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు సూచించారు. అంతేగాక సంక్షేమ పథకాలు అర్హులైన రైతులకు అందించే విధంగా మీ వంతు పాత్ర పోషించాలని వారు నూతన చైర్మన్కు సూచించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు






