15 May, 2026 | 4:17 AM

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట

15-05-2026 01:53 AM

తూప్రాన్, మే 14: ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేస్తుందని దీనితోపాటు విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, ఉచిత భోజన పథకాలను సక్రమంగా కొనసాగుతాయని రానున్న కాలంలో 21 వస్తువులతో కూడిన సీఎం కిట్టు ప్రవేశ పెట్టేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

అలాగే విద్యార్థిని, విద్యార్థులు తమ ప్రభుత్వ పాఠశాల ప్రతిష్టను పెంపొందించే విధంగా విద్యాబోధన ఉంటుందని తెలిపారు. ఇందులో గ్రామ సర్పంచ్ యాంజల స్వామి, గ్రామ పాలకవర్గం, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.