వ్యవసాయదారులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి
15-05-2026 01:57 AM
తూప్రాన్, మే 14: రైతులు వ్యవసాయం ద్వారా తమ పండిస్తున్న పంటల సేద్యంలో రసాయనిక ఎరువుల వాడకానీ వ్యవసాయ క్షేత్రంలో తగ్గించాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ రైతులకు అవగాహన కల్పించారు. రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మండలం యావపూర్ గ్రామాన్ని సందర్శించి వారు రైతులతో సూచించారు.
భూమి బలిష్టంగా ఉండడం కోసం, యూరియా వాడకం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ముఖ్యంగా వరి పంటయే కాక వరితో పాటు ఇతర పంటలను పండించాలని వారు తెలిపారు. పంట మార్పిడి వలన భూమిలో సేంద్రీయ పదార్థాలు మెరుగు పడతాయని తద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని వివరించారు. ఇందులో గ్రామ సర్పంచ్ యాంజాల స్వామి, ఎం ఏ ఓ గంగుమల్లు, ఏ ఈ ఓ హరీష్, యావపూర్ రైతులు పాల్గొన్నారు.






