26 April, 2026 | 5:15 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

అంతారం పాండురంగ విఠలేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

18-11-2025 08:33 PM

మునిపల్లి (విజయక్రాంతి): మండల పరిధిలోని అంతారం జీవన్ముక్త పాండురంగ విఠలేశ్వర ఆలయ జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆందోల్ మాజీ ఎమ్మెల్యే స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఆయన వెంట మాజీ జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్, మాజీ ఎంపీపీ శైలజ శివశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశి కుమార్, మండల యూత్ అధ్యక్షుడు ఆనంద్, మాజీ సర్పంచులు శంకర్, రమేష్ శ్రీనివాస్, సిద్ధన్న పాటిల్, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు పరశురాం గౌడ్, నాయకులు కుదుబోదిన్, విట్టల్, బండారి పాండు, భాస్కర్, నవీన్,  అప్సర్ తదితరులు పాల్గొన్నారు.