2 July, 2026 | 2:26 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

Districts - Sangareddy

article_80604028.webp
కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్

నాగలిగిద్ద: నాగలిగిద్ద మండల శిక్షణ ఎమ్మార్వో డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ దీపిక బుధవారం కరస్‌గుత్తి గ్రామంలో పర్యటించి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే ప్రక్రియలో అధికారులు అనుసరిస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలించి, భూ సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల పరిశీలన, సాంకేతిక పరికరాల వినియోగం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం ప్రజావాణిలో అందిన భూ ఫిర్యాదులకు సంబంధించి దరఖాస్తుదారుల భూములను స్వయంగా సందర్శించి పరిశీలించారు.

02-07-2026

article_54434109.webp
సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో

సిర్గాపూర్ జూలై 2(వినాయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), సుల్తానాబాద్ సబ్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, ప్రసూతి సేవలు, ప్రయోగశాల, రోగుల నమోదు వివరాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది డాక్టర్ లలిత, దేవి, జైరామ్ MLHP, కృష్ణవేణి, రాంచందర్, భాస్కర్, డాక్టర్ లక్ష్మి నారాయణ ఉన్నారు.

02-07-2026