ధైర్యంగా ఉండండి
17-06-2026 07:22 PM
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్: జిల్లా కేంద్రంలోని నేహా షైన్ హాస్పిటల్ లో కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన బుడ్డారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం హాస్పిటల్ కి వెళ్లి ఆయనను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మూసాపేట మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మన్నెం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు ఆయనను పరామర్శించారు.






