18 July, 2026 | 3:14 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   పోలవరంలో తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి   •  

అగ్గి తెగులుతో అప్రమత్తం

10-02-2026 06:11 PM

- బీరెల్లి గూడెంలో వరి పొలాల పరిశీలన

- మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ

మునుగోడు,(విజయక్రాంతి): రైతులు వరి పంటలో అగ్గి తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారిని ఎస్.పద్మజ అన్నారు. మంగళవారం మండలంలోని బీరెల్లి గూడెం గ్రామంలో వరి పొలాలను వ్యవసాయ అధికారులు సందర్శించి మాట్లాడారు. వరి పంటలో అగ్గి తెగులు, ఇతర పురుగు తెగుళ్లు ఉన్నట్లు గుర్తించారు. అగ్గి తెగులు నివారణకు ట్రై సైక్లోజోల్ 75% డబ్ల్యూపి 160 గ్రాములు,సాఫ్ 200 గ్రాములు ఒక్కో ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.

జీవ నియంత్రణ పద్ధతిలో భాగంగా సుడోమోనాస్ ఫ్లోరిసిన్స్ బ్యాక్టీరియాను ఒక లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.నాట్లు వేసిన నెల రోజుల తర్వాత పురుగుల నియంత్రణకు గుళికలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని, కావున గుళికలను ఉపయోగించకుండా స్ప్రే మందులను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు.

అలాగే పురుగుల మందులతో పాటు వేప నూనె కలిపి పిచికారీ చేయడం వలన మందుల ప్రభావం సుమారు 25 శాతం వరకు పెరుగుతుందని వివరించారు.జీవామృతం తయారీ విధానం మరియు దాని ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి ఎం. నరసింహ,రైతులు దోటి వెంకన్న, దోటి సైదులు ఉన్నారు.