18 July, 2026 | 3:03 PM

Breaking News

వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •   పాఠశాల విద్యార్థినిలపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు   •  

బీజేపీతో దేశానికి ప్రమాదం

18-07-2026 02:53 PM

ఏకపక్ష నిర్ణయాలతో దేశానికి నష్టం చేస్తున్నారు 

బీజేపీపై పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ 

ధర్మపురి,జూలై18(విజయక్రాంతి): బీజేపీతో దేశానికే ప్రమాదం ఉందనీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఏకపక్ష నిర్ణయాలతో అన్నీ వర్గాలకు నష్టం వాటిల్లే బిల్లులు ప్రవేశ పెడుతున్నారనీ ధ్వజం ఎత్తారు. యూరియా ఆప్ తో రైతులకు తీరనీ అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందనీ,కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ ప్రజల్లో గుర్తుంపు వస్తుందేమోనన్న భయాందోళనలో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు.

ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అంత భయమో తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి అడ్డుపడుతున్నారనీ బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, గుండాటి సందీప్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు గండ్ర ప్రతాప్ రావు,నాయకులు బందేల ఉదేయ్ గౌడ్,నక్క సురేష్,గుమ్ముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.