18 July, 2026 | 3:02 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •   పాఠశాల విద్యార్థినిలపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు   •   ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల్లో జాప్యం.. రైతుల ఆవేదన   •  

ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి

18-07-2026 02:57 PM

జవహర్‌నగర్, జూలై 18 (విజయక్రాంతి): జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ శివానగర్‌లో శనివారం ఉదయం ఇసుక తరలిస్తున్న టిప్పర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ యాక్టివాను ఢీకొనడంతో 13 ఏళ్ల బాలుడు ఎం. సుఫియాన్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతుడు సెయింట్ ఆంథోనీ గ్రామర్ స్కూల్‌లో విద్యార్థి. ప్రమాద సమయంలో తన సోదరుడు ఎం. సైఫ్తో కలిసి యాక్టివాపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో పరారైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.