పెండింగ్ బిల్లులు ఇప్పించాలి
- డీజీపీకి మాజీ సర్పంచ్ల ఫోరం జేఏసీ విజ్ఞప్తి
- సీఎంను కలుద్దామంటే అరెస్టులు
- సమస్యలు విన్నవించుకునే చర్యలు తీసుకోవాలి
- మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ అభివృద్ధికి గాను చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను ఇప్పించేలా చూడాలని డీజీపీ సీవీ ఆనంద్కు మాజీ సర్పంచ్ల ఫోరం జేఏసీ విజ్ఞప్తి చేసింది. సీఎంను కలిసేందుకు వెళుతుంటే పోలీసులు అరెస్టు చేస్తున్నారని అన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయన్ను కలిసేలా చర్యలు తీసుకోవాలని జే ఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ కోరా రు. శుక్రవారం యాదయ్య గౌడ్ నేతృత్వంలో డీజీపీని కలిసి వినితిపత్రం అందజేశా. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలైనా మాజీ సర్పంచ్ల బిల్లులు చెల్లించడం లేదన్నారు.
దీంతో మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందు లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వాపోయారు. తమను సీఎం రేవంత్రెడ్డితో కల్పించి సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని డీజీపీని కోరామన్నారు. డీజీపీని కలిసిన వారిలో సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, వై అరవింద్ రెడ్డి, సముద్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.






