6 May, 2026 | 8:55 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

విద్యాశాఖలో ఉద్యోగుల డేటా మ్యాపింగ్

12-11-2025 12:00 AM

లెక్కలు తీస్తున్న అధికారులు

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగుల డేటాను అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు. మూడునాలుగు రోజులుగా అధికారులు ఈ పనిలోనే నిమగ్నమయ్యారు. ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఉద్యోగుల లెక్కలన్నీ తీస్తున్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, మధ్యాహ్న భోజన కార్మికులు ఎంత మంది ఉన్నారో వివరాలు సమీకరిస్తున్నారు.

అయితే కొంత మంది మధ్యాహ్న భోజన కార్మికుల వివరాలు మ్యాచ్ కావడంలేదని అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. వీరి వివరాలను సేకరిస్తున్నారు. విద్యాశాఖకు సంబంధించిన పూర్తి వివరాలను వీలైనంత త్వరగా ఆర్థిక శాఖకు పంపించేందుకు డేటా మ్యాపింగ్ చేస్తున్నారు.