14 May, 2026 | 11:42 PM

హైదరాబాద్ లో ఎడ్-ఎ-మమ్మా రెండో స్టోర్

14-05-2026 10:04 PM

హైదరాబాదు, మే 13, 2026: పిల్లల కోసం స్థిరమైన దుస్తులు మరియు జీవనశైలి బ్రాండ్ అయిన ఎడ్-ఎ-మమ్మా, హైదరాబాదు, శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో తన రెండవ ప్రత్యేక బ్రాండ్ అవుట్‎లెట్ (ఈబిఓ) ను ప్రారంభించింది. ప్రధాన మార్కెట్లలో బ్రాండ్ యొక్క విస్తరణను మరియు అధిక-వృద్ధి సామర్థ్యం ఉన్న పట్టణాలపై దృష్టితో దక్షిణ భారతదేశములో తన ఉనికిని బలోపేతం చేసేక్రమంలో దీనిని ఆవిష్కరించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ స్థాపించిన ఎడ్-ఎ-మమ్మా, కుటుంబాల జీవనశైలి బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. 

పిల్లల దుస్తులకు బ్రాండ్ గా ప్రారంభమైన ఈ స్టోర్ తర్వాత మెటర్నిటీ వేర్, బొమ్మలు, పుస్తకాలు, యాక్సెసరీలు , ఇటీవల శిశు సంరక్షణ ఉత్పత్తులు ఉన్న ఒక విస్తృతమైన ఎకోవ్యవస్థగా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కటి చిన్నవయసు నుండే ఆలోచనాత్మక జీవనశైలిని ప్రోత్సహించే ప్రకృతి-ప్రాధాన్యత కలిగిన ఫిలాసఫీ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. హైదరాబాదు దుకాణము ప్రారంభించడం తమ బ్రాండ్ వ్యూహానికి మరింత మద్దతును అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఆవిష్కరణను ప్రోత్సహించడం, ప్రమేయం మరియు భౌతిక మరియు డిజిటల్ ప్లాట్‎ఫార్మ్స్ రెండిటిలో మళ్ళీ మళ్ళీ కొనుగోళ్ళు చేయడములో ఆఫ్‎లైన్ రీటెయిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. లేక్‎షోర్ మాల్ Y జంక్షన్ వద్ద నగరములో ఇప్పటికే ఒక స్టోర్ కు మంచి స్పందన వచ్చిందనీ, దీంతో వినియోగదారుల బేస్ తో తన అనుబంధాన్ని దృఢపరుచుకునేందుకు రెండో స్టోర్ ను ప్రారంభించినట్టు తెలిపారు. తమ బ్రాండ్ అభివృద్ధిలో హైదరాబాద్ నగరం ముఖ్యమైనదిగా నిలిచిందని ఎడ్-ఎ-మమ్మా వ్యవస్థాపకురాలు ఆలియా భట్ చెప్పింది. తమ దృష్టి ఎప్పుడు పిల్లలకు  అనుకూలంగా ఉండే ఉత్పత్తులను తయారు చేయడంపై ఉందనీ పేర్కొంది.