15 June, 2026 | 9:00 PM

Breaking News

విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

06-04-2026 12:50 AM

206 మందిపై కేసు నమోదు 

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి మద్యం మత్తులో వాహనాలు నడిపి న 206 మందిపై కేసులు నమోదు చేశారు. రెండు రోజుల పాటు (ఏప్రిల్ 3,4) తేదీల్లో జరిపిన ఈ ప్రత్యేక డ్రైవ్లో పట్టుబడిన వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం.

మద్యం మత్తులో వాహనం నడపడం తీవ్రమైన నేరమని, అటువంటి స్థితిలో ప్రమాదం జరిగి ప్రాణ నష్టం కలిగితే భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 105 ప్రకారం కేసులు నమోదు చేసి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు.