15 June, 2026 | 10:34 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

15-06-2026 09:23 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన లక్ష్యానికి మించి ఉద్యానవన పంటలను రైతులు సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం వల్ల రైతులు లాభాలు పొందగలుగుతారని వివరించారు. ప్రస్తుతం విపణిలో ఉద్యానవన పంటలకు డిమాండ్ ఉన్నదని, దీనికి అనుగుణంగా రైతులు ఉద్యానవన పంటల  సాగు వైపు మల్లాలని సూచించారు. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో రైతులకు అధిక లాభాలు కలుగుతాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తదనుగుణంగా రైతులకు క్షేత్రస్థాయిలో ఉద్యానవన పంటల సాగుపై అవగాహన కల్పించాలని తెలిపారు.