13 May, 2026 | 12:52 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

సీపీఎం నేత సామినేని రామారావు హత్య.. డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

31-10-2025 10:18 AM

హైదరాబాద్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం రైతు సంఘం నాయకుడు, మాజీ సర్పంచ్ సామ్నేని రామారావును(CPM leader Samineni Rama Rao) గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. దుండగులు అతని గొంతు కోసి అక్కడికక్కడే చంపేశారు. ఈ దారుణ సంఘటన రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. సీపీఎం నేత సామినేని రామారావు హత్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM  Bhatti Vikramarka ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు కుటుంబానికి భట్టి విక్రమార్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీనిని హేయమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) హింసా రాజకీయాలకు తావు లేదన్న డిప్యూటీ సీఎం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. 

ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి(Deputy CM) ఖమ్మం పోలీసు అధికారులను ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడాలని ఆదేశించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయడానికి క్లూస్ టీం, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీంలు, అందుబాటులో ఉన్న అన్ని ఆధునిక దర్యాప్తు సాంకేతిక పరిజ్ఞానాలను మోహరించాలని ఆదేశించారు. అక్రమాలు, శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని తేల్చిచెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సామినేని రామారావు(Samineni Rama Rao) కుటుంబానికి  సంతాపం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి, ఈ క్లిష్ట సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని, పూర్తి మద్దతు ఇస్తానని భట్టి విక్రమార్కపేర్కొన్నారు.