9 April, 2026 | 4:54 PM

Breaking News

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •   పొంగులేటి కాదు— పొంగు'లూటీ'   •   గడి మైసమ్మకు మున్సిపల్ కార్మికుల బోనాలు   •   రైతులు గోదాములను సద్వినియోగం చేసుకోవాలి   •  

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక లోపం.. 300కి పైగా విమానాలు ఆలస్యం

07-11-2025 02:53 PM

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అయిన ఢిల్లీ విమానాశ్రయంలో(Indira Gandhi International Airport) శుక్రవారం గందరగోళం నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా 300కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యం అయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. విమానాశ్రయంలోని అన్ని విమానయాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. అధికారులు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సమస్యల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో తమ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, అకాసా ఎయిర్ తెలిపాయి.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airports Authority of India) ఎక్స్ లో ట్వీట్ చేస్తూ, "ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాను సపోర్ట్ చేసే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)లోని సాంకేతిక సమస్య కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ఆలస్యం అవుతున్నాయి. కంట్రోలర్లు విమాన ప్రణాళికలను మాన్యువల్‌గా ప్రాసెస్ చేస్తున్నారు. దీనివల్ల కొంత ఆలస్యం జరుగుతోంది. సాంకేతిక బృందాలు వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాయి." అని పేర్కొంది.