9 April, 2026 | 10:37 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

జాతీయ గేయం కాంగ్రెస్ వక్రీకరించింది

08-11-2025 12:22 AM

బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపణ

న్యూఢిల్లీ, నవంబర్ 7: మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ గేయాన్ని ఉద్దేశపూర్వకంగానే వక్రీకరించారని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు. 1937లో మతపరమైన సున్నితత్వాన్ని శాంతింపజేయడానికి దుర్గాదేవిని కీర్తిస్తున్న చరణాలను తొలగించారని ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు సీఆర్ కేశవన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వందేమాతరం కుదించబడిన భాగాన్ని మాత్రమే స్వీకరించిందని, దుర్గాదేవిని స్తుతించే చరణాలను ఉద్దేశపూర్వకంగా తొలగించిందని ఆయన ఆరోపించారు.