ఎస్ఐఆర్పై పూర్తి అవగాహన కల్పించాలి
మానల మోహన్ రెడ్డి
మల్లాపూర్, జూలై 26(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలకు వివరించాలని రాష్ట్ర సహకార కార్పొరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు.జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండ ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి,
ప్రజలకు సరైన సమాచారం అందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు చొరవ చూ పాలని సూచించారు.క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియపై నెలకొన్న సందేహాలను ని వృత్తి చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం కాంగ్రెస్ శ్రేణుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






