17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సనత్ నగర్ బస్టాండ్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సీఐ శ్రీనివాసులు

06-10-2025 07:44 PM

సనత్ నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ సీఐ శ్రీనివాసులు సనత్ నగర్ బస్టాండ్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాత్రి వేళలో బస్టాండు సమీపంలో యాచకులు ఎంతోమంది ఉండటంతో బస్సు ఎక్కే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుండడంతో అక్కడ రాత్రిపూట యాచకులు పండుకోవటం మంచిది కాదని వాళ్లకు చెప్పి వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని యాచకులను హోంకి పంపించే ఏర్పాట్లు చేశారు. షెల్టర్లు లేని వాళ్ళు పనిచేసుకునే వాళ్లను కూడా వాళ్ళ ఆధార్ కార్డులను గుర్తించి వాళ్ల దగ్గర కూడా ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్లకు కూడా హోమ్ కి పంపించే ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల రాత్రిపూట జనాభా లేకుండా చూసుకోవాలని అక్కడ ఉన్న హోటల్ యాజమాన్యానికి సూచించారు. ఈ మధ్యకాలంలో 25 మందికి పైగా యాచుకులను ఆలేటి ఆశ్రమం అబ్దుల్లాపూర్ మెట్ హోం కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.