9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

మానవాళికి శాంతి,ప్రేమను పంచిన యేసు ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

26-12-2025 12:00 AM

ములకలపల్లి, డిసెంబర్ 25,(విజయక్రాంతి):క్రిస్టమస్ వేడుకలను గురువారం ములకలపల్లి మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ములకలపల్లి, జగన్నాధపురం, చాపరాలపల్లి, పొగళ్లపల్లి, తిమ్మంపేట,పూసుగూడెం ఉమ్మడి గ్రామపంచాయతీలలో ఏసుప్రభు జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ఆరాధన, ప్రార్థనలను జరిపారు. కేకు కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు.

పాస్టర్లు ఏసుక్రీస్తు జన్మ విశిష్టతను, ఆయన చేసిన బోధనలను,పంచిన ప్రేమ,శాంతి సందేశాలను వివరించారు.క్రిస్మస్ వేడుకలలో కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు జననం ప్రపంచంలోని మానవాళికి గొప్ప ప్రేమ శాంతి సందేశం అందించిందని క్రీస్తు మార్గంలో ప్రజా ప్రభుత్వం అన్ని కులాలకు మతాలకు వర్గాలకు ప్రజాపాలన అందిస్తుందని ఈ ప్రభుత్వానికి, ప్రజలకు యే సు ఆశీర్వాదాలు ఉండాలని ఆయనవీవీ ఆకాంక్షించారు.

పేదలకు నూతన వస్త్రాలను బహుకరించారు.కార్యక్రమంలో ఆయన వెంట ములకలపల్లి సర్పంచ్ కొర్సా చంద్రలేఖ, ఉప సర్పంచ్ పువ్వాల లలితారావు, వార్డు సభ్యులు ముదిగొండ శీను, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఈర్ల సంజీవ్ కాం గ్రెస్ నాయకులు వల్లెపు మహేష్, మాజీ వైస్ ఎంపీపీ గోలి రమణ, గోలి సందీప్ పాల్గొన్నారు