వరుసగా మూడో సంవత్సరం 100% ఫలితాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
గుండాల ఈఎంఆర్ఎస్ పాఠశాల ఘనత
గుండాల,(విజయక్రాంతి): బుధవారం ప్రకరించిన పదవ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) గుండాల పాఠశాల వరుసగా మూడో సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించి, విశేష ప్రతిభ కనబరిచిందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నితిన్ సింగ్ తెలిపారు. ఈ విజయానికి పాఠశాల టాపర్లు జి. అకాంక్ష, బి. కృష్ణవేణి, వి. మధు ప్రియా తమ అత్యుత్తమ ఫలితాలతో పాఠశాలకు గౌరవాన్ని తీసుకువచ్చారని విద్యార్థులను ఆయన అభినందించారు.
ఈ ఘనత విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం వల్ల సాధ్యమైందని, ఈఎంఆర్ఎస్ గుండాల నిరంతర విజయాలతో స్థానిక తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందుతూ, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతనిచ్చే విద్యాసంస్థగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని ఆకాంక్షించారు.






