16 April, 2026 | 9:00 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్రభుత్వ పథకాలు అంటే ప్రజల జీవితాల్లో మార్పు

16-04-2026 01:48 PM

డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలు అంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు అని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 32వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ భాగంగా వార్డ్ సభలో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం హామీలు.

ఉచిత బస్, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, రేషన్ కార్డ్స్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ , వంటి పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందిస్తుంది అని తెలిపారు. కార్యాచరణ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి కి సహకరించలి అని   కోరారు అనంతరం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్  కమిషనర్ రాజన్న , డి ఎం సి లక్ష్మీ, కార్పొరేటర్ వెన్నెల రఘు, శ్రావణ్ కుమార్ , రాఘవేంద్రర్, మైత్రి యాదయ్య , నక్క శ్రీను వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాలు,వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.