10 June, 2026 | 6:25 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

చెరువులోని నల్లమట్టి పంట పొలాలకు జీవామృతం లాంటిది

10-06-2026 05:23 PM

- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): చెరువుల్లోని సారవంతమైన వండ్రు మట్టి పంట పొలాలకు జీవామృతం లాంటిదని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న చెరువు పూడికతీత పనులను బుధవారం పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చెరువుల నుంచి వెలికితీసే వండ్రు మట్టిని రైతులు తమ వ్యవసాయ భూములకు తరలించుకోవడం వల్ల భూమి సారం పెరిగి పంటల దిగుబడులు మెరుగుపడతాయని కలెక్టర్ తెలిపారు. చెరువుల పూడికతీత ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాల మట్టాలు వృద్ధి చెందడంతో రైతులకు సాగునీటి లభ్యత మెరుగవుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను నాణ్యతతో, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు.