ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశం
10-06-2026 05:21 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10.06.2026న సంఘ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ట్రెజరీ కార్యాలయంలో ఎస్టిఓగా పనిచేస్తూ, బదిలీ అయిన వెంకటేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ లను సన్మానించారు. అదే విధంగా ఎస్ టి ఓ గా నూతనంగా చేరిన శారద ని సన్మానించారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అనే అంశం గూర్చి, పూర్వ ప్రిన్సిపాల్ గిరిజన విద్యా కళాశాల భద్రాచలం డాక్టర్ ప్రభుదయాల్ సవివరంగా వివరించారు. అఖండమైన సర్వీసుతో విశేషమైన అనుభవాన్ని గడించి పదవి విరమణ చేసిన వారంతా, వారి అనుభవాలు, విశేషమైన జ్ఞాన పరిధి మేరకు, అందరికీ చక్కని మార్గదర్శకం సూచించాలని కోరారు.






