6 April, 2026 | 4:16 PM

Breaking News

ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •   హిందూ సమ్మేళనానికి రూ 5100 విరాళం   •   ప్రజావాణి ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి   •   బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మిట్టపల్లి ప్రవీణ్ కుమార్   •   సుల్తానాబాద్ లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   బోళ్ళ రామారావుకి నివాళులు   •   బీజేపీ 47వ స్థాపన దివస్ వేడుకలు తంగళ్ళపల్లిలో ఘనంగా నిర్వహణ   •   కరీంనగర్‌లో కవల పిల్లల హత్య— కన్నతండ్రితో సహా నలుగురు అరెస్ట్   •  

క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి

03-10-2025 07:17 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన అవసరమని గాంధీ మెడికల్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఇండ్ల లిఖిత శ్రీ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మండలానికి చెందిన మేడికోలు నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలు తమకు అవగాహన లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారని వారికి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి విధి అని సూచించారు. క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ఆమె వివరించారు. ప్రతి 40 సంవత్సరాలు దాటిన మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన టెస్టులు చేయించుకోవాలని ఆమె సూచించారు. అవగాహన సదస్సులో మండలానికి చెందిన మెడికోలు సంగ రవితేజ, సాయి దీపక్ వర్మ, కొత్త విఖ్యాత్ లు పాల్గొన్నారు.