27 April, 2026 | 3:34 PM

Breaking News

మండు వేసవిలో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ   •   స్వీయ జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి   •   ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన నియోజకవర్గ ఇన్చార్జి.   •   తల సేమియా.. చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావాలి   •   తెలంగాణలో కొత్త పార్టీకి ఏం పని— సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు   •   అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.!   •   కన్నతండ్రి కన్నీటి ఆవేదన.. దారి తప్పిన కొడుకు— బైక్ తగలబెట్టిన తండ్రి   •   తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. భారీగా బౌన్సర్ల మోహరింపు   •   కోనరావుపేటలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •  

అల్- ఫలాహ్ వర్సిటీ చైర్మన్ అరెస్ట్

06-02-2026 02:15 AM

సిద్ధిఖీపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

విద్యాసంస్థల గుర్తింపులో మోసగించారంటూ యూజీసీ అభియోగాలు

కోర్టులో హాజరుపరిచిన ఢిల్లీ పోలీసులు 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: విద్యాసంస్థల గుర్తిం పు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలపై హరియాణాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జవాద్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.  యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు  ఢిల్లీ క్రైం బ్రాంచ్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సిద్ధిఖీపై ఢిల్లీ పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం సిద్ధిఖీని ఢిల్లీ కోర్టులో హాజరుపరచగా  కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేసినట్లు తెలిపారు.

13న ఈడీ చార్జీషీట్‌పై విచారణ

జనవరి 16న అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్ధిఖీ, అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్‌పై మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు వినేందుకు ఢిల్లీ సాకేత్ కోర్టు విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. చార్జీషీట్‌తో పాటు సమర్పించిన పత్రాలను పరిశీలించేందుకు సిద్ధికీ తరఫు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది. యూనివర్సిటీ, అనుబంధ సంస్థలు గడువు ముగిసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సి ల్ (నాక్) గుర్తింపును ఉన్నట్లుగా చూపించినట్లు ఈడీ తెలిపింది. తప్పుడు ప్రకటనల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించి అడ్మిషన్లు పొందారని తెలిపింది. ఆ విధంగా వసూలు చేసిన ఫీజులు ’ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్’ కిందకు వస్తాయని పేర్కొంది.