2 May, 2026 | 6:54 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

జిల్లాలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు

29-04-2026 01:31 AM

మెదక్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): జిల్లాలో సరిపడ పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని ఆర్డీవో రమాదేవి తెలిపారు. మంగళవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపును తహసిల్దార్ లక్ష్మణ్ బాబు తో పరిశీలించారు. అదే సమయంలో 12000 లీ. ఆయిల్ ట్యాంకర్ (8000-పెట్రోల్,4000-డీజిల్) రావడం జరిగినది.

ప్రస్తుత పెట్రోల్ నిల్వ : 29,232 లీ ఉన్నాయన్నారు. ప్రస్తుత డీజిల్ నిల్వ : 26,667 లీ. నిల్వ ఉన్నాయని, ప్రస్తుతం సరిపడా పెట్రోల్, డీజిల్ లభ్యత కలదు. కావున ఇట్టి విషయాన్ని వినియోగదారులు గమనించి కలత చెందే అవసరం లేదని కోరడం జరిగినది. అనంతరం మెదక్ మండలం రాజ్ పల్లి లోని PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగినది. గన్ని సంచుల వివరాలు, తాగునీటి సౌకర్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగినది. కాగా ఇప్పటి వరకు 1200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సిబ్బంది తెలిపారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.