2 June, 2026 | 7:01 PM

Breaking News

సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •   విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి   •   అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కే.అజయ్ కుమార్   •   ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ   •   జవహర్‌నగర్‌లో భారీ ఎత్తున మానవహారం   •   భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •  

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం

02-06-2026 05:53 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ప్రాణాలను ఫణంగా పెట్టి ఒక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పలు ప్రాంతాలలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా అమీర్ పేటలోని సత్యం థియేటర్ సర్కిల్ లో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన కు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం, పార్టీ పతాకాలను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం ఉద్యమకారులను సన్మానించారు. అక్కడి నుండి తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో  తెలంగాణ ఉద్యమకారులు, మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పోరాడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వం లో జరిగిన పోరాటంలో  ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములైన విషయాన్ని గుర్తు చేశారు. స్వయం పాలన తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2 మనకు పండుగ రోజుగా ఆయన పేర్కొన్నారు.