2 June, 2026 | 8:04 PM

అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాదులు

02-06-2026 05:50 PM

మంథని సహకార సంఘం పర్సన్ ఇంచార్జి చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): అమరవీరుల త్యాగాలే తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి పునాధులని మంథని సహకార సంఘం పర్సన్ ఇంచార్జి చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. తెలంగాణా అవతరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో సంఘం పర్సన్ ఇంచార్జి చైర్మన్ కొత్త శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం పర్సన్ ఇంచార్జి చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... నేటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని, 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశపు 29వ రాష్ట్రంగా అవతరించింది.

ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు,  ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రం నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, భాష, కళలను ప్రపంచానికి చాటిచెప్పే రాష్ట్రంగా ఎదుగుతోందని, వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల రంగాల్లో మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ స్పూర్తిని సజీవంగా ఉంచుతూ, సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం లక్ష్యాల సాధనకు ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ల నాయకత్వంలో ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు.