19 March, 2026 | 1:07 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

08-10-2025 12:52 AM

పోతారంలో గ్రామస్తులకు అవగాహన సదస్సులో ఎస్‌ఐ రవికుమార్

మంథని,ముత్తారం, అక్టోబర్ 7 (విజయ క్రాంతి):  శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవు ముత్తారం ఎస్త్స్ర రవి కుమార్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పోతారం గ్రామస్తులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించారు.

త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని ప్రజానీకంతో మమేకమై అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులను అధ్యయనం చేసి ఎలాంటి గొడవలు సమస్యలు తలెత్తకుండా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా గొడవలకు దూరంగా ఉండాలని, అందరూ సోదర భావంతో మెలగాలని, ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని గ్రామ ప్రజానీకం సహకరించాలని అన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్త్స్ర రవికుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విపిఓ శ్రావణ్ రెడ్డి, పోలీసు సిబ్బంది రాజు, సుమంత్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.