డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్
దేవరకొండ,(విజయక్రాంతి): డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అంతో సంతోషంగా ఉంటుందని నేనావత్ అనిల్ కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం అచ్చమ్మకుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ అనిల్ కుమార్ కి ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయగాన సభలో ముఖ్య అతిధులు యాక్టర్స్ డాక్టర్.బాలిరెడ్డి పృద్వి రాజ్, తెలుగు హీరో రాంకీ చేతుల మీదుగా డా.బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్-2026 అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా పృద్విరాజ్, హీరో రాంకీ మాట్లాడుతూ.... గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశేష సేవ కార్యక్రమాల నందు అనిల్ కృషి చేశారని, డావ్ ఆర్ఫనేజ్ ట్రస్ట్ మేనేజర్ డైరెక్టర్ గా చేస్తూ సుమారు 20 మంది తల్లిదండ్రులు లేని పిల్లలను, రోడ్ సైడ్ ఉన్న పిల్లలను అన్ని విధాలుగా ముందుండి, వారికి చదువుపిస్తున్నారని,చిన్న తనంలోనే గొప్ప గొప్ప కార్యక్రమాలకు అనిల్ కుమార్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఎల్లప్పుడూ ఇలానే సహాయ సహకారాలు చేస్తూ ముందుకు సాగాలని అనిల్ కుమార్ ని కొనియాడారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.... నేను హిమగిరినగర్ కాలనీ, రాజేంద్రనగర్ లోని డావ్ ఆర్ఫనేజ్ ట్రస్ లో గత మూడు సంవత్సరాలుగా మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తున్నాను.
ట్రస్ట్ చైర్మన్ అయిన రామాపురం మల్లేష్, ఈస్టర్ రాణి ఈ ట్రస్ట్ ను స్థాపించారు. ఈ ట్రస్ట్ లో సుమారు 20 మంది తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలు ఉన్నారు. మేము సంపాదించ్చే రూపాయిలో సగ భాగం పిల్లల ఖర్చులకు పెడుతున్నామన్నారు. కొన్ని సందర్భాలలో మా ఇల్లు గడవలేని పరిస్థితులలో కూడా అప్పులు చేసి మరీ అన్ని మేమై పిల్లలను చూసుకుంటూ దగ్గరలో ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నామని,విద్యతో వారికి ఒక ఉన్నత స్థానాలకు తీసుకురావలని మా ట్రస్ట్ చిన్న ప్రయత్నం అని,వారు ఉన్నత స్థాయిలో చేరుకొని, ఇలాంటి మరెన్నో సేవలు అందిస్తానని అన్నారు.త్వరలో ఒక ఫౌండేషన్ ఏర్పాటు ప్రతి ఒక్క పేద వారికి ఎంతోకొంత సహాయం చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం పేర్కొన్నారు.






