8 July, 2026 | 12:23 PM

కూసుమంచిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

08-07-2026 10:59 AM

కూసుమంచి, (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని బుధవారం కూసుమంచి రాజీవ్ చౌక్ లో మినీ గాంధీభవన్ లో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ హఫీజుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి గ్రామ సర్పంచ్  కొండా కృష్ణవేణి, మండల కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు బుస్సా మాధవరెడ్డి, గుండా భూపాల్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు. కొండా మహిపాల్,  బెల్లంకొండ కిరణ్ కుమార్, వడ్తియా రాజు నాయక్, కందుల నర్సింహారావు, గుండా వెంకటరెడ్డి, నాగిరెడ్డి రంగారెడ్డి, హలావత్ సైదులు నాయక్, పాల్గొన్నారు.