20 March, 2026 | 1:17 PM

వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

20-03-2026 12:00 AM

60 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ ఎక్కి మహిళను ఓదార్చిన సబ్ కలెక్టర్

కామారెడ్డి, మార్చి 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలం బుర్గల్ గ్రామంలో ఓ మహిళ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడబోతుండగా.. బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి ట్యాంకర్ పైకి ఎక్కి ఆమెతో మాట్లాడి కిందకు తీసుకువచ్చారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. గురువారం స్రవంతి అనే యువతి కుటుంబ విభేదాల నేపథ్యంలో గ్రామంలోని 60 అడు గుల ఎత్తున నీటి ట్యాంకర్ పైకి ఎక్కింది.

సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కిరణ్మయి 60 అడుగుల ట్యాంకర్ ఎక్కి స్రవ ంతిని ఓదార్చుతూ కౌన్సెలింగ్ నిర్వహించా రు. ఆమెతో చర్చలు జరిపి, నమ్మకం కల్పిం చి సురక్షితంగా కిందికిదించేలా కీలక పాత్ర పోషించారు. ఎల్లారెడ్డి ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు, సర్పంచ్ సమన్వయంతో యువతిని కిందికి దించారు.