27 June, 2026 | 7:08 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

అంగరంగ వైభవంగా శ్రీ అలివేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం

06-02-2026 05:21 PM

పాల్గొన్న ఎక్స్ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

షాద్‌నగర్,(విజయక్రాంతి): కేశంపేట మండల కేంద్రంలోని శ్రీ దవలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం  అంగరంగ వైభవంగా శ్రీ అలవేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి  కళ్యాణ మహోత్సవంలో కేశంపేట మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశంపేట సర్పంచ్ బొజ్జం సంతోష శ్రీశైలం, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విశాల దంపతులను స్వామి వారి ఆశీర్వచనాలు  మరియు శాలువాతో సత్కరించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు, భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.