బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తాం
13-06-2026 12:00 AM
ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ మధుసూదన్ యాదవ్
హైదరాబాద్, జూన్ 12(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బోనాల జాతరను, ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ ఎం మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయంలో, కే రాజేష్ యాదవ్, ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ డీసీసీ సెక్రెటరీ అశోక్ కుమార్ యాదవ్లు మధుసూధన్ను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా, కే రాజేష్ యాదవ్, అశోక్ కుమార్ యాదవ్లు మాట్లాడుతూ నగరంలో ఉన్న, అమ్మవారి ఆలయాల అభివృద్ధి, తన వంతు కృషి చేయాలని ఆయన్ని కోరినట్లు తెలిపారు.






