లైసెన్స్ లేని, నాణ్యత లేని విక్రయదారులకు బారీ జరిమానా
30-07-2026 04:46 PM
ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఆహార భద్రతా లైసెన్స్ తీసుకోవాలని సూచన
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఆహార భద్రత లైసెన్స్ తీసుకోవాలని ఆహార భద్రతా అధికారి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆహార భద్రతా అధికారి వరుణ్ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా లైసెన్సు లేకుండా బేకరీ నడుపుతున్నందుకు రూ.10,000 జరిమానా అదేవిధంగా వేరుశెనగలు, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించే వారిపై రూ.75,000 జరిమానా విధించారు. ఈ జరిమానాలు వివిధ దుకాణాలు, రెస్టారెంట్లపై విధించారు. ప్రజలకు సురక్షితమైన కల్తీ లేని ఆహారాన్ని ఇవ్వాలని ఈ ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.






