19 June, 2026 | 5:09 PM

Breaking News

పోచమ్మ బోనాల వేడుకల్లో ఏనుగు మనోహర్ రెడ్డి   •   కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్   •   ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ కృషి ఆదర్శనీయం   •   బేల ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు   •   టాస్క్ ,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన   •   బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించిన కోల్ మూవ్‌మెంట్ అధికారి బి.వెంకన్న   •   మంథని నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పుట్ట మధుకర్ చౌకబారు ఆరోపణలు   •   బాలిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎంపీ ఎమ్మెల్యేలు   •   అన్న-అక్క మెంటార్‌షిప్ శిబిరం   •   చైన్ స్నాచింగ్ పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

19-06-2026 03:32 PM

అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మార్మట్ సూచించారు. శుక్రవారం కాగజ్‌నగర్ మున్సిపాలిటీని సందర్శించి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, ప్రజా సేవల అమలు తీరును సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ షహీన్ సుల్తానా, వార్డు కౌన్సిలర్లతో సమావేశమై పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఆనంతరం ఎల్లగౌడ్ తోట పార్క్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్ అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు, పరిశుభ్రత, పచ్చదనం, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పార్కు నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు పచ్చదన పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.బి. రామాదేవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం. శంకర్, పర్యావరణ ఇంజనీర్ డి. ప్రణీల్ కుమార్,అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.