4 July, 2026 | 10:37 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

వృక్షారోపణకు సేవ చేస్తున్న వెంకన్నకు పూర్వ కలెక్టర్ నుంచి సహాయం

21-03-2026 05:07 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాస గుట్ట వద్ద వృక్షారోపణకు విశేషంగా కృషి చేస్తున్న పిట్టల వెంకన్నకి, పూర్వ జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ బదిలీపై వెళ్లే సందర్భంలో తమ సొంత నిధుల నుంచి రూ.10,000/- ఆర్థిక సహాయం అందించారు. ఆ మొత్తాన్ని శుక్రవారం పిట్టల వెంకన్న  అందజేశారు.

పాండురంగపురం గ్రామానికి చెందిన పిట్టల వెంకన్న  పాల్వంచలోని శ్రీనివాస గుట్టపై భక్తులకు సేవగా అనేక వృక్షాలను నాటి సంరక్షిస్తున్నారు. గుట్టకు వచ్చే భక్తులకు మొక్కలు అందించేందుకు నర్సరీ ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు. ఈ నర్సరీ ఏర్పాటుకు అవసరమైన మొక్కల కొనుగోలు, పెంపకం, తోటపని పరికరాలు, కొమ్మల ద్వారా పెంచే మొక్కలు కోసం ప్రోత్సాహకంగా ఈ సహాయం అందజేశారు.