26 April, 2026 | 6:32 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

26-04-2026 04:53 PM

వేడుకలో పాల్గొన్న జిల్లా ఆర్యవైశ్య  సంఘం ఉపాధ్యక్షులు అయిత పరంజ్యోతి     

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో శ్రీ వాసవీ మాత జయంతి సందర్భంగా  ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి దేవాలయం లో నిర్వహించిన కుంకుమ అర్చన కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగాయిఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలు, పుష్పాభిషేకాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు అయిత పరంజ్యోతి  ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా, మండల ప్రజలందరికీ, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెరగాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని అన్నారు.