9 May, 2026 | 5:32 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

ట్యాంకులో ఊపిరాడక ఇద్దరు మృతి

24-12-2025 12:07 AM

అపార్టుమెంట్ ఎస్టీపీ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ప్రమాదం

రామచంద్రాపురం(పటాన్‌చెరు), డిసెంబర్ 23: అపార్టుమెంట్‌లోని ఎస్టీపీ ట్యాంకులను శుభ్రం చేస్తూ, ఊపిరాడక ఇద్దరు ఆపరేటర్లు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో జరిగింది. సోమిత్ రుయిడాస్(22)    కొల్లూరులోని బ్లాసమ్ హైట్స్ అపార్టుమెంట్‌లో ఎస్టీపీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనితో పాటు హరీష్‌సింగ్  కూడా పనిచేస్తున్నాడు. 22న రాత్రి వరకు ఎస్టీపీ ట్యాంకులోని నీటిని తొలగించిన అనంతరం ఇద్దరు ఆపరేటర్లు ట్యాంక్ శుభ్రపరిచేందుకు లోపలికి వెళ్లారు. వారికి ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరై, అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.