13 July, 2026 | 5:26 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

గోవా టూర్‌లో విషాదం

30-12-2025 01:20 AM
  1. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

ఒకరి పరిస్థితి విషమం

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విషాదం

సంగారెడ్డి, డిసెంబర్ 29 (విజయక్రాంతి): గోవా టూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. గోవాకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా మరి కొందరు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన 15 మంది యువకులు మూడు వాహనాల్లో గోవా టూర్‌కు వెళ్లారు.

సరదాగా గడిపి సోమవారం తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని సోలాపూర్ సమీపంలోకి రాగానే ఒక వాహనం కారు టైర్లు పగిలిపోయి బోల్తా పడింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న రిహాన్, పవన్‌కుమార్ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందాడు. కమ్రుద్దీన్ అనే యువకుడు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాడు. మరికొంతమందికి  స్వల్ప గాయాలయ్యాయి.